Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషి మనిషే.. దేవుడు దేవుడే... మనిషి దేవుడు కాలేడు : చంద్రబాబు

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:59 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని విష్ణువుతో పోల్చిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా మండిపడ్డారు. ఆయన గురువారం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారం కోసం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవుడే దేవుడే... మనిషి మనిషే... మనిషి ఎప్పుడు దేవుడు కాలేడన్నారు. మనుషులను దేవుడితో పోల్చడం తప్పన్నారు. ఇప్పుడే కాదు... గతంలోనూ తిరుమలలో చాలా అపవిత్ర కార్యక్రమాలు జరిగాయన్నారు. 
 
పింక్ డైమండ్ మాయం వంటి ఆరోపణలు చేసిన వ్యక్తిని.. మళ్ళీ నియమించడం మంచి సాంప్రదాయం కాదన్నారు. అలా చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని సూచించారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందన్నారు. రాష్ట్రానికి అతి పెద్ద ఆస్తి వెంకటేశ్వర స్వామి అని పేర్కొన్నారు. 
 
తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అపవత్రాలకు పాల్పడిన వారిని తిరిగి శ్రీవారి సన్నిధిలో విధులకు నియమించడం అనేది అతిపెద్ద తప్పుగా చంద్రబాబు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments