Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులివెందుల గడ్డపై చంద్రబాబు ఫైర్.. చికెన్‌ కొట్టులోనూ వైకాపా ఎమ్మెల్యే వసూళ్లు

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (16:31 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులకు రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తే, వైకాపా పాలనలో సీఎం జగన్‌ కేవలం రూ.2 వేల కోట్లే ఖర్చు చేశారని ఆరోపించారు.
 
'సాగునీటి ప్రాజెక్టుల సందర్శన'లో భాగంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. జమ్మలమడుగు సర్కిల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. ఈ సందర్భగా సీఎం జగన్‌, వైకాపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే చికెన్‌ కొట్టులోనూ వసూళ్లకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్‌కు ప్రజలను దోచుకోవాలనే తప్ప.. మేలు చేయాలనిలేదని విమర్శించారు. 
 
జగన్‌ కొత్తగా ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా? ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు. జమ్మలమడుగు ప్రజల కోసం తెదేపా నేత భూపేష్‌ పనిచేస్తారని చంద్రబాబు చెప్పారు. మరోవైపు, పులివెందులలో తెదేపా ఫ్లెక్సీలను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి నివాసానికి సమీపంలో ఇది జరిగింది. తెదేపా నాయకులు వారిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments