Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరూరా రాజారెడ్డి రాజ్యాంగం : అచ్చెన్నాయుడు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (18:00 IST)
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని ఏపీ టీడీపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం చోడవరం గ్రామ సచివాలయం పైనున్న జగన్‌ వాల్‌పోస్టర్‌ను చించారనే నెపంతో గ్రామంలో కూడా లేని తెలుగుదేశంపార్టీ సానుభూతిపరులు బోడ కృష్ణ, నిమ్మగడ్డ చైతన్యలను అక్రమంగా అదుపులోకి తీసుకుని కోర్టుకు కూడా హాజరుపరచకుండా నాలుగు రోజులుంచి చిత్రహింసలకు గురిచేయడం దుర్మార్గంమని మండిపడ్డారు. 
 
ఎటువంటి సంబంధంలేని వ్యక్తులను అదుపులోకి తీసుకుని వేధించడమే రాజారెడ్డి రాజ్యాంగమా? ఎన్నికల కౌంటింగ్‌ రోజు జగన్‌ వాల్‌పోస్టర్‌ చించితేనే హడావుడి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలపై భౌతిక దాడులకు దిగిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎటువంటి ఆధారాలు లేకుండా తెదేపా కార్యకర్తలను ఎలా అదుపులోకి తీసుకుంటారు? 
 
కోర్టుకు కూడా హాజరుపరచకుండా ఏ విధంగా స్టేషన్‌లో ఉంచుతారు? బోడ కృష్ణ, నిమ్మగడ్డ చైతన్యలకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి. వెంటనే తెదేపా కార్యకర్తలను వదిలిపెట్టి ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవన్.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments