Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీల ప్రాణం తీసిన అతివేగం.. విహార యాత్రలో విషాదం

అతివేగం నలుగురు టెక్కీల ప్రాణం తీసింది. అతివేగం వారిని తిరిగిరాని లోకాలకు చేర్చింది. ఫలితంగా విహార యాత్రలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... టీసీఎస్‌ కంపెనీకి చెందిన కొందరు ఇంజనీర్లు వ

Webdunia
సోమవారం, 2 జులై 2018 (13:53 IST)
అతివేగం నలుగురు టెక్కీల ప్రాణం తీసింది. అతివేగం వారిని తిరిగిరాని లోకాలకు చేర్చింది. ఫలితంగా విహార యాత్రలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... టీసీఎస్‌ కంపెనీకి చెందిన కొందరు ఇంజనీర్లు విహారయాత్ర కోసం ఆదిలాబాద్‌ జిల్లా, నేరడిగొండ మండలం, కుంటాల జలపాతాన్ని సందర్శనార్థం వచ్చారు.
 
తిరుగు ప్రయాణంలో నిర్మల్‌ జిల్లా ఎల్లపెల్లి గ్రామ సమీపంలో వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా టైరు పేలిపోవడంతో వాహనం డివైడర్‌ను ఢీకొని, పల్టీలు కొట్టి, రోడ్డుపక్కన పడింది. ఈ ప్రమాదంలో వాహనాన్ని నడుపుతున్న సాప్ట్‌వేర్‌ ఉద్యోగి దినేష్‌ (27), కుసుమ (28) అక్కడికక్కడే మృతిచెందారు. 
 
మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడడంతో వారిని హుటాహుటిన నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఏరియాస్పత్రికి తరలించి చికిత్సలు జరిపారు. తీవ్రంగా గాయపడినవారిలో యుగేంధర్‌, శ్రీవిద్య, నవీన్‌, నిఖిత ఉన్నారు. వీరికి అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం నిజామాబాద్‌కు తరలించారు. నిజామాబాద్‌లో చికిత్సపొందుతూ వీరిలో శ్రీవిద్య మృతిచెందింది. ఆ తర్వాత మరో ఇద్దరు టెక్కీలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments