Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు బండారం బయటపెడతా: స్పీకర్ తమ్మినేని

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (18:57 IST)
చంద్రబాబు బండారం బయటపెడతామని, ప్రజలముందు నిలుచోబెట్టి గుడ్డలూడదీస్తామని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అగ్రిగోల్డ్ విషయంలో గత ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్లాన్ వేశారని అన్నారు. అగ్రిగోల్డ్‌తో సంబంధంలేదని చంద్రబాబు ప్రకటించగలరా? అని తమ్మినేని ప్రశ్నించారు.

తనకెంతో అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని మడిచి ఎక్కడో పెట్టుకోవాలని తమ్మినేని అన్నారు. ఎన్నికల ముందు రూ. 10 వేలు ఇస్తానని చెప్పి అందరి దగ్గర పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వాలే స్కాంలకు పాల్పడితే ప్రజలేమైపోవాలని తమ్మినేని ప్రశ్నించారు. కళ్ల ముందు అన్యాయం జరిగితే స్పీకర్ స్పందించకూడదా అన్నారు. తాను ముందు ఎమ్మెల్యేనని, తర్వాతే స్పీకర్‌నని చెప్పారు.

చంద్రబాబు ప్రతి ఒక్కటీ మాయ చేశారని విమర్శించారు. యనమల రామకృష్ణుడు, సీఎం రమేష్ తదితరులు హాయ్‌ల్యాండ్‌ ఆస్తులను కొట్టేందుకు ప్రయత్నించారని తమ్మినేని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments