Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో రోడ్డు ప్రమాదం : అయ్యప్ప భక్తుల మృతి

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (18:05 IST)
తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా నర్సాపూర్ వాసులుగా గుర్తించారు. 
 
పుదుక్కోట రహదారిపై 16 మందితో అయ్యప్ప భక్తులతో వస్తున్న కారును కంటైనరుతో వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తులు మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శబరిమలలో అయ్యప్ప దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. మృతులంతా మెదక్ జిల్లా నర్సాపూర్‌ వాసులుగా గుర్తించారు. మృతులను నాగరాజు, మహేశ్, శ్యామ్, ప్రవీణ్, సాయి, ఆంజనేయులు, సురేశ్, కృష్ణగా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను తిరుమయం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments