150 సెగ్మెంట్లలో 'తలైవా' ఓటు బ్యాంకు - సర్కారు బెంబేలు...

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి అనారోగ్యంపాలుకావడంతో రాజకీయ శూన్యత నెలకొనివుంది. దీన్ని భర్తీ చేసేందుకు అటు కమల్ హాసన్, ఇటు రజనీకాంత్‌లు పోటీ

Webdunia
సోమవారం, 14 మే 2018 (15:11 IST)
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి అనారోగ్యంపాలుకావడంతో రాజకీయ శూన్యత నెలకొనివుంది. దీన్ని భర్తీ చేసేందుకు అటు కమల్ హాసన్, ఇటు రజనీకాంత్‌లు పోటీ పడుతున్నారు. ఇందుకోసం వారు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు.
 
అయితే, తమిళనాడులోని అత్యధిక శాసనసభ నియోజకవర్గాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మంచి ఆకర్షణ ఉన్నట్టు ఓ రహస్య సర్వే తేల్చింది. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ సర్వేను చూసిన అధికార అన్నాడీఎంకే దీంతో కంగుతిన్న సర్కారు అప్రమత్తమైనట్లు తెలిసింది. 
 
రాజకీయ ప్రవేశాన్ని ఖరారు చేసినప్పటికీ ఇప్పటివరకు పార్టీని మాత్రం రజనీకాంత్‌ ప్రారంభించలేదు. ఆయన రాజకీయ పార్టీ ప్రారంభంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల రజనీకాంత్‌ అమెరికాకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తమిళనాడులో ఆయనకు ప్రజామద్దతు ఎలా ఉందనే విషయాన్ని నిఘావర్గాలతో రాష్ట్ర ప్రభుత్వం రహస్య సర్వే చేయించిందని సమాచారం. 
 
రాష్ట్రంలోని 234 శాసనసభ నియోజకవర్గాల్లో 150 స్థానాల్లో ఆయనకు ప్రజామద్దతు ఉందనే విషయం వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో రజనీకాంత్‌కు 35 నుంచి 40 శాతం మేరకు ఓటు బ్యాంకు సిద్ధమైందని తేలినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో 15 శాతం దళితులు, 8 శాతం మైనారిటీలు, 15 శాతం ఇతర సామాజికవర్గం, రాజకీయ అసంతృప్తులు ఉన్నారని ప్రభుత్వానికి అందించిన నివేదికలో నిఘా వర్గాలు వెల్లడించాయని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments