Webdunia - Bharat's app for daily news and videos

Install App

29న గులాబీ కండువా కప్పుకోనున్న తలసాని, తీగల, సోమేశ్వర్!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:32 IST)
టీడీపీ తెలంగాణ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి ఈ నెల 29న గులాబీ కండువా కప్పుకోనున్నారు. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు ఇప్పటికే అన్నీ చర్చలు పూర్తయ్యాయని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. 
 
ఈ నేపథ్యంలో 29న మీర్ పేటలోని టీఆర్ఆర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో వీరిద్దరూ కారెక్కనున్నారని తెలిసింది. 
 
మరోవైపు వైకాపా నేత వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోమేశ్వర్ రావు శనివారం టీఆర్ఎస్‌లోకి చేరనున్నారు. తద్వారా సోమేశ్వర్ రావు కూడా జంప్ జిలానీల లిస్టులోకి చేరారు. 
 
తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో వైకాపా జిల్లా అధ్యక్ష పదవికి  సోమేశ్వర్ రావు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధినేత జగన్‌కు పంపించారు. 
 
సోమేశ్వర్ రావు రాజీనామాతో వరంగల్ జిల్లాలో... వైకాపాకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments