Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ సన్యాసం తీసుకుంటావా? ఎర్రబెల్లిని టార్గెట్ చేసిన తలసాని

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (14:25 IST)
టీ టీడీపీ, టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమ పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన నేతలు, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మొన్నటికి మొన్న టీ టీడీపీ కార్యకర్తలు చావు డప్పు మోగించిన సంగతి తెలిసిందే.

దీనిపై తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ధీటుగా స్పందించారు. టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావును టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
సనత్ నగర్‌కు జరిగే ఉప ఎన్నికల్లో తాను ఓటమిపాలైతే, రాజకీయాల నుంచి తప్పుకుంటానని తలసాని ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఓడితే, రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అంటూ ఆయన ఎర్రబెల్లికి సవాల్ విసిరారు. నోటి మాటతో కాకుండా పెద్ద మనుషుల సమక్షంలో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుందాం రమ్మంటూ తలసాని ఛాలెంజ్ చేశారు. మరి దీనికి ఎర్రబెల్లి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments