స్వైన్ ఫ్లూ మరోమారు రెచ్చిపోతోంది. హైదరాబాద్లో ఇప్పటికే అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. అధికారులలో గుబులు పెరిగిపోతోంది. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు అనుమానితులు ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో వారు ఉన్నారు.
ఈ యేడాది మొదట నుంచి తెలంగాణలో ఇప్పటి వరకూ 2157 మందికి ఈ వ్యాధి సోకింది. ఇందులో 79 మంది మరణించారు. వాతావరణం చల్లబడుతుండడంతో స్వైన్ ఫ్లూ పెరుగుతోందనే అనుమానం కలుగుతోంది. ఖమ్మ జిల్లా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే మరో ఇద్దరు మాత్రం వైద్యుల పరీక్షలలో ఉన్నారు.