Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూశారు.. అందుకే టీడీపీలో చేరుతున్నా : ఎస్వీ మోహన్ రెడ్డి

Webdunia
శనివారం, 7 మే 2016 (08:17 IST)
కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి వైకాపాకు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌ వైఖరి పట్ల తీవ్ర మనస్తాపంతో తానీ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. కేవలం కర్నూలు నగర అభివృద్ధి కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ ఆయన వెల్లడించారు. 
 
2014 ఎన్నికల్లో కర్నూలు నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన ఆయన.. టీడీపీ అభ్యర్థి టీజీ వెంకటేశ్‌పై విజయం సాధించారు. తన బావ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, మేనకోడలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ టీడీపీలో చేరినప్పటి నుంచి ఎస్వీ కూడా అదే బాటలో నడుస్తారని ప్రచారం జరుగుతోంది. దానిని నిజం చేస్తూ శుక్రవారం విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని మోహన్‌రెడ్డి ప్రకటించారు. 
 
నా చెల్లెలు శోభానాగిరెడ్డి మరణించాక నా మేనకోడలు అఖిలప్రియను ఆళ్లగడ్డ ప్రజలు ఎంతో నమ్మకంతో ఆదరిస్తున్నారు. అయితే అఖిలప్రియ టీడీపీలో చేరాక జగన్‌ నుంచి నాపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. నా సొంత చిన్నాన్న ఎస్వీ నాగిరెడ్డిని రానున్న ఎన్నికల్లో అఖిలప్రియపై పోటీ చేయించాలని జగన్‌ పదేపదే ఒత్తిడి తెచ్చారు అని వెల్లడించారు. 
 
అలాగే, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జగన్‌ కర్నూలులో దీక్ష చేపడుతున్న విషయం మాటమాత్రమైనా తనకు చెప్పకపోవడం బాధ కలిగించిందన్నారు. ఇవన్నీ భరించలేక, ప్రజలకు ఎంతో కొంత చేయాలన్న ఆలోచనతో టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. అధికారం కోసమో, మంత్రి పదవులకోసమో పాలక పార్టీలో చేరడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో వైకాపాలో ఉండలేక శనివారం కర్నూలులో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరుతున్నట్లు ప్రకటించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

తర్వాతి కథనం
Show comments