Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూర్ టు ఏపీ బస్ సర్వీస్ ?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (21:15 IST)
బెంగళూరుతో పాటూ కర్ణాటక నుంచి బస్సుల్లో రావాలనుకునేవారికి బ్యాడ్‌న్యూస్. ఏపీ-కర్ణాటక మధ్య నడిచే అంతర్రాష్ట్ర  బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 15 నుంచి సర్వీసులు ఆగిపోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14 నుంచి బెంగళూరు సిటీ, రూరల్ ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది.
 
ఈ నెల 23 వరకు పూర్తిస్థాయిలో నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. అత్యవసర పనుల ఉన్నవారికి మాత్రమే రోడ్లపైకి అనుమతి ఇస్తారు. లాక్‌డౌన్ కారణంతో బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఏపీ వైపు సర్వీసులను ఆపేస్తున్నట్లు ఇప్పటికే కర్ణాటక ప్రకటించింది. ఇక ఏపీ నుంచి వచ్చే బస్సులను అనుమతించే విషయమై సోమవారం సాయంత్రంలోపు దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
 
ప్రస్తుతానికి బస్సులు తిప్పుతున్నా.. దీనిపై కర్ణాటక అధికారులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. బెంగళూరు నుంచి వస్తున్న వలస కూలీలు, ఇతరులు రాకపోకలు కొనసాగిస్తున్నారు.
 
కర్ణాటక కూడా ఏపీకి బస్సులు నిలిపివేసింది. దీంతో ఏపీ అధికారులు కూడా ఆలోచనలో పడ్డారు. పరిస్థితిని గమనించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ సర్వీసులు రద్దుకే మొగ్గు చూపితే ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ టికెట్ల డబ్బు వాపసు చెల్లించనున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments