Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Webdunia
గురువారం, 27 మే 2021 (10:56 IST)
సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. గురువారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. 
 
ఈ ఘటన మునగాల మండలంలోని మాధవరం శివారులో చోటు చేసుకుంది. స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పలు వివరాలు సేకరించారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
మృతులు కోదాడ సాలర్జంగ్‌పేటకు చెందిన గాధరి ఫ్రాన్సిస్ (56), ఎల్లమ్మ (53)గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పోలీసులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో సాలర్జంగ్‌పేటలో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments