Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (09:14 IST)
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తనపై సీబీఐ విచారణ నిలిపివేయాలంటూ ఆమె దాఖలుచేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 
 
గతంలో ఓబుళాపురం గనుల తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తేలేవరకూ... ఓఎంసీ కేసులో తనపై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేయాలని ఆమె గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు సెప్టెంబరు 21వ తేదీన కొట్టివేసింది. దీంతో ఆమె సుప్రీంకోర్టు తలుపు తట్టారు. 
 
ఈ పిటిషన్‌పై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏ.ఎస్‌.బోపన్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. శ్రీలక్ష్మి తరఫున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. సీబీఐ ఇప్పటికే నాలుగు ఛార్జిషీట్లు దాఖలు చేసిందని, ప్రతిసారీ అదనపు ఛార్జిషీట్ల దాఖలుకు సమయం కోరుతోందని తెలిపారు. 
 
రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తేలలేదని, తొమ్మిదేళ్లుగా సీబీఐ పూర్తిస్థాయిలో అభియోగాలు నమోదు చేయనందున కేసు విచారణను నిలిపివేయాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. 
 
ఇప్పటికే విచారణ ముగింపు దశకు చేరుకుందని సీబీఐ తెలిపిందని, త్వరగా ముగించాల్సిందిగా తాము ఒత్తిడి చేయలేమని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. హైకోర్టు అన్ని అంశాలూ పరిశీలించి తీర్పు ఇచ్చినందున ప్రత్యేకంగా విచారణ చేయాల్సిందేమీ లేదంటూ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం