Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కిల్ కేసులో 17ఏపై ముగిసిన వాదనలు : తీర్పు రిజర్వు చేసిన సుప్రీంకోర్టు

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (17:26 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. ఈ పిటిషన్‌పై ఇరు తరపు వాదనలు ముగిశాయి. దీనిపై అవసరమైతే కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని చంద్రబాబు తరపు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం మన్నించింది. ఈ కేసులో చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సీఐడీ తరపున ముకుల్ రోహిత్గీలు వాదనలు వినిపించారు. 
 
చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉన్నారని, ఆయన ఎలాంటి నేరానికి పాల్పడలేదని, ఈ నేపథ్యంలో 73 యేళ్ల వయసులో ఉన్న వ్యక్తి బెయిల్ ఇవ్వాలని హరీశ్ సాల్వే కోరారు. అవసరమైతే కోర్టుకు లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని ఆయన విజ్ఞప్తి చేశారు. సాల్వే విజ్ఞప్తిని అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. 
 
ఈ క్రమంలో శుక్రవారం తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రోజు నాటికి చంద్రబాబు తరపు న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలు సమర్పించవలసి ఉంటుంది. లిఖితపూర్వక వాదనలు సమర్పించడ మినహా శుక్రవారం వాదనలు ఉండే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు. శుక్రవారం ఉదయం లేదా మధ్యాహ్నం నాటికి లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తారు కాబట్టి శుక్రవారం సాయంత్రానికి తీర్పు ఇవ్వొచ్చని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

#chiranjeevi birthday : 'విశ్వంభరు'నికి జనసేనాని పుట్టిన రోజు శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments