Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 24న సొంతూరు పొన్న‌వ‌రానికి సీజేఐ ఎన్వి రమణ

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (11:33 IST)
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలిసారిగా జ‌స్టిస్ నూతలపాటి వెంకట రమణ త‌న స్వ‌గ్రామం కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలోని పొన్నవరం రానున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక మొదటి సారి సొంత ఊరుకు ఆయ‌న ఈ నెల 24న వ‌స్తుండ‌టంతో స్థానికులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.  
 
 
పొన్న‌వ‌రంలో ఆయ‌న 25న వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 24 నుంచి 26 తేదీ వరకు సీజేఐ ఏపీలో ఉంటారు. 26న ఏపీ రాజధానికి వ‌చ్చి, హైకోర్టు సందర్శనతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

 
 ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ నెల 26న జరగనున్న ఏపీ రాష్ట్ర స్థాయి న్యాయాధికారులు రెండో సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 
 
 
అదే రోజు ఏపీ హైకోర్టుకు వ‌చ్చి, హైకోర్టు న్యాయవాదుల సంఘం, బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగే సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక ఏపీ హైకోర్టుకు ర‌మ‌ణ రావడం ఇదే మొదటి సారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments