మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పోలిస్తే తమ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి బలమైన నేత అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా మెదక్ ఎన్నికల్లో సునీతా లక్ష్మారెడ్డి విజయం సాధించారని ఆయన ఆకాంక్షించారు.
మెదక్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించామని షబ్బీర్ అలీ చెప్పారు. ఎన్నిక ముగిసే వరకు నేతలు మండలాల్లోనే మకాం వేస్తారని తెలిపారు. కాగా టీఆర్ఎస్ తరపున కొత్త ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి జగ్గారెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.