Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో 35.8 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత.. ఈ ఏడాది ఎండలు మండిపోతాయ్

హైదరాబాద్ నగరంలో శుక్రవారం 35.8 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. అది ఈ నెలాఖరులోగా 42డిగ్రీల సెల్షియస్‌కు చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ఎండలు మండిపోతాయని వాతావరణశాఖ

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (10:46 IST)
హైదరాబాద్ నగరంలో శుక్రవారం 35.8 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. అది ఈ నెలాఖరులోగా 42డిగ్రీల సెల్షియస్‌కు చేరుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ఎండలు మండిపోతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 1992 నుంచి 2015 వరకు ఎండదెబ్బ వల్ల 22 వేలమంది మృత్యువాత పడ్డారని జాతీయ వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది. 
 
2015లో వడదెబ్బ వల్ల 2,400 మంది, 2016లో 1,100 మంది మరణించారని ఆ సంస్థ పేర్కొంది. ఈ ఏడాది మండే ఎండల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ కోరింది.
 
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విపరీతమైన ఎండలు, వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. హైదరాబాద్ నగరంలో రాత్రి ఎనిమిది గంటల తరువాత కూడా వేడి గాలుల ప్రభావం తగ్గలేదు. నిజామాబాద్‌లో రికార్డు స్థాయిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 42.4 డిగ్రీలు, రామగుండం 45, మెదక్ 44, భద్రాచలం 43, జగిత్యాల 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్‌లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

ఇల్లూ వాకిలి తాకట్టుపెట్టి సినిమా తీశాం.. భారీ నష్టాలు చవిచూశాం : రకుల్ ప్రీత్ సింగ్ భర్త

ఓ విషయం మీద బలంగా రియాక్ట్ అవ్వాలని ఉంది... బన్నీ వాసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments