Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం: సుజనా చౌదరి

Webdunia
గురువారం, 26 నవంబరు 2015 (09:35 IST)
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలిపారు. న్యూఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశం అనంతరం సుజనా చౌదరి  మీడియాతో మాట్లాడుతూ... రెండు నెలలకొకసారి ఎన్డీయే పక్షాల సమావేశం నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరినట్లు చెప్పారు. 
 
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారన్నారు. నీతి ఆయోగ్‌ నివేదిక రాగానే కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రధాని చెప్పినట్లు సుజనా వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి మరోసారి సమస్యలు వివరించాలని తనకు సూచించారన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలవనున్నట్లు సుజనా చెప్పారు. అకాల వర్షాలు, వరదలపై నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. 
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments