Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల ఆశీర్వాదంతో విజయం: పవన్‌కల్యాణ్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:26 IST)
రాష్ట్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. పరిషత్‌ ఎన్నికల్లో గెలిచిన జనసైనికులకు పవన్‌కల్యాణ్ అభినందనలు తెలిపారు. వైసీపీ నేతల దాష్టీకాలను తట్టుకుని నిలబడ్డారని ఆయన కొనియాడారు.

కడియంలంకలో జనసేన జెండా ఎగురడం ఖాయమన్నారు. దీనిని అడ్డుకోవాలని అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. వివాదం చేయాలని చూస్తే తానే స్వయంగా ఇక్కడకి వస్తానని ఆయన ప్రకటించారు.

సతీష్ అనే వ్యక్తిని పోలీసులే చితక బాదటం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. అయ్యప్ప అనే వ్యక్తిపై వైసీపీ గూండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలలో పోలీసు అధికారులు ఎందుకు స్పందించ లేదన్నారు.

జరుగుతున్న వరుస ఘటనలపై  ఛీఫ్ సెక్రటరీ, ఎన్నికల కమిషనర్, డీజీపీలు స్పందించాలన్నారు. స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments