Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి నారాయణకు షాక్.. బెయిల్ రద్దు చేసిన జిల్లా కోర్టు

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (15:52 IST)
టీడీపీ నేత, మాజీ మంత్రి, పి.నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10వ తరగతి పరీక్ష పేపర్ల లీక్ కేసులో నారాయణకు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను కోర్టు రద్దు చేసింది. 
 
10వ తరగతి పరీక్ష పేపర్ల లీక్ కేసులో నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది ఏప్రిల్‌లో అరెస్టయిన అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
అయితే, నారాయణ బెయిల్ రద్దు చేయాలని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు 9వ అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు నారాయణ బెయిల్‌ను రద్దు చేసింది. నవంబర్ 30లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
 
ఈ ఏడాది ఏప్రిల్‌లో చిత్తూరు జిల్లా నెల్లెపల్లి హైస్కూల్‌లో 10వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకైనట్లు వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. దీని వెనుక నారాయణ హస్తం ఉందంటూ చిత్తూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే నారాయణ తరపు న్యాయవాదులు 2014లో నారాయణ సంస్థల అధినేత పదవి నుంచి తప్పుకున్నారని కోర్టుకు తెలిపారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం బెయిల్‌ను చిత్తూరు జిల్లా 9వ అదనపు కోర్టు రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments