స్వామివారికి భక్తులంటే ఎనలేని ప్రేమ అని, పురాణాల్లోని ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షం ఘట్టాలు దీన్ని నిరూపిస్తున్నాయని చెప్పారు.
పవిత్రమైన తిరుమలలో వారం రోజుల పాటు బస చేసి స్వామివారికి ప్రియమైన భక్తులకు సేవలందించడం శ్రీవారి సేవకుల పూర్వజన్మ పుణ్యఫలమన్నారు. సేవకులు తమ ప్రాంతాలకు వెళ్లి ఇక్కడి అనుభవాలు, వసతులను తెలియజేసి మరింత మంది శ్రీవారి సేవకు వచ్చేలా కృషి చేయాలని కోరారు.