Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఉదయం 11 గంటలకు శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రారంభం

జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఉదయం 11 గంటలకు శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్నాయి. మీడియా హడావుడికి దూరంగా అంత్యక్రియలు ముగించాలని శ్రీనివాస్‌ కుటుంబసభ్యులు భావిస్తున్నట్టు సమాచారం.

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (07:41 IST)
అమెరికాలో జాతి విద్వేష తూటాకు బలైన శ్రీనివాస్‌ మృతదేహం ఆయన మరణించిన ఐదు రోజులకు సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. కాన్సస్‌ నుంచి ముంబైకి చేరుకున్న ఆయన భౌతికకాయాన్ని తీసుకొచ్చిన ప్రత్యేక విమానం సోమవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని కార్గో టెర్మినల్‌లో లాండయింది. మృతదేహంతోపాటు శ్రీనివాస్‌ భార్య సునయన, బంధువులు ఉన్నారు. మరోవైపు.. కుమారుడి మృతదేహాన్ని తీసుకునేందుకు శ్రీనివాస్‌ తల్లిదండ్రులతోపాటు వారి సమీప బంధువులు కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. 
 
విమానాశ్రయంలో ఆయన మృతదేహానికి తెలంగాణ రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, కుత్బుల్లాపుర్‌ ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ అధికారుల సమక్షంలో శ్రీనివాస్‌ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. తర్వాత 11.30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో బాచుపల్లి ప్రాంతంలో ఉన్న అతడి నివాసానికి తరలించారు. కొడుకు మృతదేహాన్ని చూసి తండ్రి మధుసూదన్ , తల్లి వర్షిణి కుప్పకూలిపోయారు. బంధువులు బోరున విలపించారు. ఈ సమయంలో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. 
 
జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఉదయం 11 గంటలకు శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్నాయి. మీడియా హడావుడికి దూరంగా అంత్యక్రియలు ముగించాలని శ్రీనివాస్‌ కుటుంబసభ్యులు భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సహకరించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఉదయం 9.30 గంటలకు అంత్యక్రియలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments