Webdunia - Bharat's app for daily news and videos

Install App

భావనపాడు సముద్రతీరంలో యువతి మృతదేహం.. ప్రియుడి అరెస్టు

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (16:17 IST)
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా భావనపాడు సముద్ర తీర ప్రాంతంలో గుర్తుతెలియని యువతి మృతదేహం కలకలం సృష్టించింది. సంతబొమ్మాళి మండలంలోని ఈ యువతి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం అటుగా సుముద్ర తీర ప్రాంతానికి వెళ్లిన స్థానికులు ఈ మృతదేహాన్ని గుర్తించి నౌపాడ పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే యువతి విషం తాగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. మృతురాలు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన యువతిగా నౌపాడ పోలీసులు గుర్తించారు. 
 
ప్రియుడితో కలిసి ఆమె గురువారం భావనపాడు సముద్రతీరానికి వచ్చినట్లు స్థానికులు పోలీసులకు వివరించారు. ఈ క్రమంలో ప్రియుడు, ప్రియురాలి ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో ఆమె విషం తాగినట్లు పేర్కొంటున్నారు. విషం వెంట తెచ్చుకున్న యువతి సమీపంలోని జీడిమామిడి తోటకు వెళ్లి తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments