Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం తోడబుట్టిన వారిని హతమార్చిన తమ్ముడు

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (12:58 IST)
ఆస్తి వివాదంతో ఓ వ్యక్తి తోడబుట్టిన వారినే తెగనరికాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రామచంద్రాపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. గ్రామానికి చెందిన సన్యాసిరావు ఎప్పటిలాగే ఆదివారం ఉదయం పశువుల శాలలో పాలు తీస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన తమ్ముడు రామకృష్ణ కత్తితో నరికాడు. 
 
సమీపంలో ఉన్న అక్క జయమ్మ ఆందోళనతో అక్కడికి రాగా.. ఆమె పైనా వేటు వేశాడు. రక్తపు మడుగులో కుప్పకూలిపోయిన ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనతోపాటు అందుకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతులను రామచం‍ద్రాపురం గ్రామానికి చెందిన గొర్లె రామకృష్ణ అనే వ్యక్తి తన సొంత అక్క జయమ్మ, అన్న సన్యాసి రావులుగా గుర్తించారు. 
 
భూవివాదాల‌ కార‌ణంగా వారి మ‌ధ్య కొంత కాలంగా విభేదాలు రాజుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే సొంత అక్క‌, అన్నపై రామ‌కృష్ణ ప‌గ పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments