Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం తోడబుట్టిన వారిని హతమార్చిన తమ్ముడు

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (12:58 IST)
ఆస్తి వివాదంతో ఓ వ్యక్తి తోడబుట్టిన వారినే తెగనరికాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రామచంద్రాపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. గ్రామానికి చెందిన సన్యాసిరావు ఎప్పటిలాగే ఆదివారం ఉదయం పశువుల శాలలో పాలు తీస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన తమ్ముడు రామకృష్ణ కత్తితో నరికాడు. 
 
సమీపంలో ఉన్న అక్క జయమ్మ ఆందోళనతో అక్కడికి రాగా.. ఆమె పైనా వేటు వేశాడు. రక్తపు మడుగులో కుప్పకూలిపోయిన ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనతోపాటు అందుకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతులను రామచం‍ద్రాపురం గ్రామానికి చెందిన గొర్లె రామకృష్ణ అనే వ్యక్తి తన సొంత అక్క జయమ్మ, అన్న సన్యాసి రావులుగా గుర్తించారు. 
 
భూవివాదాల‌ కార‌ణంగా వారి మ‌ధ్య కొంత కాలంగా విభేదాలు రాజుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే సొంత అక్క‌, అన్నపై రామ‌కృష్ణ ప‌గ పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments