శ్రీకాకుళంలో పిడుగుపాటుకు నలుగురి దుర్మరణం

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (22:24 IST)
శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని వంగర మండలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, సీతంపేట మండలంలో ఒకరు చనిపోయారు. వంగర మండలంలోని మరణించిన వారిలో అచ్యుతరావు అనే పదో తరగతి విద్యార్థి కూడా ఉన్నారు. 
 
నిజానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో సూర్యతాపం తారాస్థాయిలోవున్నది. భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. అయితే, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఫలితంగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో పిడుగులు పడడంతో నలుగురు మరణించారు. 
 
మృతుల్లో అచ్యుతరావు అనే పదో తరగతి విద్యార్థి, మరో ముగ్గురు పశువుల కాపరులు ఉన్నారు. వీరంతా పశువులు మేపడానికి వెళ్లి పిడుగుపాటుకు గురయ్యారు. పైగా, మృతులంతా నిరుపేదలని ప్రభుత్వమే వీరిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments