Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొంక లాగి తీగను ప‌ట్టుకున్న శ్రీసిటీ పోలీసులు

Webdunia
శనివారం, 3 జులై 2021 (13:30 IST)
చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు పోలీసులు డొంక‌ను లాగి తీగ‌ను ప‌ట్టుకున్నారు. వారం క్రితం జ‌రిగిన శ్రీ సిటీలో కాప‌ర్ వైర్ చోరీ కేసును విజ‌య‌వంతంగా ఛేదించారు. ముగ్గురు నిందితుల నుంచి 80 కేజీల కాఫర్ స్వాధీనం చేసుకున్నారు.

ఆరూరు చెక్ పోస్ట్ వద్ధ వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి చోరికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ధ నుండి‌ లక్ష యాభై వేలు విలువ చేసే 80 కేజీ ల కాఫర్ ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీసిటీలోని ఉత్తమాకి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో కాఫర్ చోరి జరిగిందని గత నెల 23 న పరిశ్రమ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

శ్రీసిటీ డిఎస్పీ జగదీష్ నాయక్, సిఐ శ్రీనివాసులు సూచనలు మేరకు శ్రీసిటీ ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆరూరు చెక్ పోస్ట్ వద్ధ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, చోరికి పాల్పడిన ముగ్గురిని గుర్తించారు.

తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా పాలవాకంకు చెందిన యువరాజ్, భరత్, డేవిడ్ అనే ముగ్గురి నుంచి కాప‌ర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఎఎస్ఐ షణ్ముగం, హెడ్ కానిస్టేబుళ్లు హరిబాబు, శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు కిరణ్, దయాకర్, హరీష్, ప్రహ్లాద్, రాజు ఉత్తమ ప్రతిభ కనపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments