Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా శ్రీరామపట్టాభిషేకం

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (23:40 IST)
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వం నిర్వ‌హించారు.
 
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ఠ, చతుర్దశకలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.
 
రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీరామపట్టాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.  ముందుగా విష్వ‌క్సేన‌‌పూజ‌, పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్ర‌తిష్ట‌, య‌జ‌మాని సంక‌ల్పం, స్వామివారికి వ‌స్త్ర స‌మ‌ర్ప‌ణ‌, లక్ష్మీ ప్ర‌తిమ పూజ‌, స్వామివారికి కిరిట స‌మ‌ర్ప‌ణ చేశారు. త‌రువాత ప్ర‌ధాన హోమం, పూర్ణాహూతి, సీత‌మ్మ‌వారికి, ల‌క్ష్మ‌ణ స్వామికి, ఆంజ‌నేయ‌స్వామివారికి రాముల‌వారి న‌గ‌లను బ‌హూక‌రించారు.

అనంత‌రం నివేద‌న‌, హార‌తి, చ‌తుర్వేద పారాయ‌ణం, మ‌హా మంగ‌ళ‌హార‌తి, య‌జ‌మానికి వేద ఆశీర్వాదం చేశారు. శ్రీరామపట్టాభిషేకం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ ప్రాంగ‌ణంలో ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి పార్వ‌తి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు,  సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, ఆల‌య అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments