Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోదా ముఖ్యం కాదు.. ప్రాజెక్టులే ప్రాణం : వెంకయ్య

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (17:13 IST)
ప్రత్యేక హోదా ముఖ్యం కాదు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఏమిటి లాభం.. అయినా వెనుకబడే ఉన్నాయి. ఆ రాష్ట్రాలు ప్రస్తుతం ప్రాజెక్టుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రత్యేక హోదా కంటే ప్రాజెక్టులే ప్రాణమని తెలిపారు. శనివారం నెల్లూరు జిల్లా పొదలకూరులో రూ.3.80 కోట్లతో నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కంటే ముందు ప్రాజెక్టులను సాధించుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ఆందోళన చెందకుండా ప్రాజెక్టులను తీసుకు రావడంలో అందరూ కలిసి వస్తే రాష్ట్రం పరుగులు పెడుతుందన్నారు. చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ ఆర్థిక స్వావలంబన లేక చతికిల పడ్డాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. 
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరవు, పొదలకూరు ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, ఎమ్మెల్సీ చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

Show comments