Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెలకు కోపమొచ్చింది: నా బాధ్యతలను ఎవ్వరూ గుర్తుచేయాల్సిన అవసరం లేదు!

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (10:30 IST)
అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రెడ్డి విపక్ష నేతలపై మండిపడ్డారు. కోపంతో ఊగిపోయారు. అసెంబ్లీలో తాను ఎవ్వరికీ అనుకూలంగా వ్యవహరించట్లేదని, నిబంధనల ప్రకారమే సభ నడుపుతున్నానని కోడెల అన్నారు. అసెంబ్లీలో అధికార పక్షానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో, విపక్షాలకూ అంతే ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యమైన అంశాలపై చర్చకు వెంటనే అనుమతించాలని పట్టుబడుతూ, పోడియంలోకి దూసుకొచ్చిన వైకాపా సభ్యులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తన బాధ్యతలు తనకు తెలుసునని, వాటిని ఎవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదని కాస్తంత ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏం చేయాలో విపక్ష సభ్యులు తనకు చెప్పాల్సిన పని లేదన్నారు. అసెంబ్లీలో అందరికీ అవకాశం వస్తుందని, అప్పుడు మాత్రమే మాట్లాడాలని కోరారు. జగన్ మాట్లాడుతుంటే మాత్రం తమ స్థానాల్లో కూర్చునే వైకాపా సభ్యులు, మరెవరు మాట్లాడుతున్నా వెల్‌లోకి దూసుకురావడం సమంజసం కాదన్నారు. సభా మర్యాదలు పాటించాలని విపక్ష సభ్యులకు కోడెల సూచించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments