Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు ఒకటో తేదీ : "మిలియన్ మార్చ్‌"కు అనుమతి లేదు

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (21:01 IST)
సీపీఎస్ (సెంట్రల్ పెన్షన్ స్కీమ్) రద్దు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సెప్టెంబరు ఒకటో తేదీన తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డిని నివాసం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం ఛలో తాడేపల్లి, ఛలో విజయవాడలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా, లక్ష మందికి సీఎం ఇంటి వద్ద మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో గుంటూరు ఎస్పీ హఫీజ్ కీలక ఆదేశాలు జారీచేశారు. "ఛలో విజయవాడ", "ఛలో తాడేపల్లి" కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఆందోళనలో పాల్గొనేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 
 
ఒక్క గుంటూరు జిల్లాలోనే ఇప్పటికే 2 వేల మందికి నోటీసులు ఇచ్చామని ఎస్పీ తెలిపారు. విజయవాడ, తాడేపల్లిలలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. అందువల్ల మిలియన్ మార్చ్ కార్యక్రమంలో ఏ ఒక్కరూ పాల్గొనవద్దని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments