Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు ఒకటో తేదీ : "మిలియన్ మార్చ్‌"కు అనుమతి లేదు

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (21:01 IST)
సీపీఎస్ (సెంట్రల్ పెన్షన్ స్కీమ్) రద్దు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సెప్టెంబరు ఒకటో తేదీన తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డిని నివాసం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం ఛలో తాడేపల్లి, ఛలో విజయవాడలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా, లక్ష మందికి సీఎం ఇంటి వద్ద మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో గుంటూరు ఎస్పీ హఫీజ్ కీలక ఆదేశాలు జారీచేశారు. "ఛలో విజయవాడ", "ఛలో తాడేపల్లి" కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఆందోళనలో పాల్గొనేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 
 
ఒక్క గుంటూరు జిల్లాలోనే ఇప్పటికే 2 వేల మందికి నోటీసులు ఇచ్చామని ఎస్పీ తెలిపారు. విజయవాడ, తాడేపల్లిలలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. అందువల్ల మిలియన్ మార్చ్ కార్యక్రమంలో ఏ ఒక్కరూ పాల్గొనవద్దని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments