Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో మసాజ్ సెంటర్

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (08:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా ఒకపుడు గుర్తింపును సొంతం చేసుకున్న విజయవాడ నగరంలో ప్రధానమైన రైల్వే జంక్షన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ జంక్షన్ మీదుగా ప్రతి రోజూ వందల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఈ రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రయాణికుల కోసం మసాజ్ సెంటర్‌ను ప్రారంభించారు. అయితే, ఇది అమ్మాయలు మసాజ్ చేసే సెంటరు కాదు. రోబోటిక్ మసాజ్ సెంటర్. 
 
ఈ అత్యాధునిక మసాజ్ సెంచటర్ ద్వారా ప్రయాణికులు అతి తక్కువ రుసుంతో బాటీ, ఫుట్ మసాజ్ సేవలు పొందొచ్చు. ఒకటో నంబరుఫ్లాట్‌ఫాంపై ఏర్పాటుచేసిన ఈ రెండు రోబోటిక్ బాడీ మసాజ్ కుర్చీలు, ఒక ఫుట్ మసాజ్ కుర్చీ అందుబాటులో ఉన్నాయి.
 
దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజరు శివేంద్ర మోహన్ సోమవారం వీటిని ప్రారంభించారు. బాడీ మసాజ్‌కు రూ.60, ఫుట్ మసాజ్‌కు రూ.30 చొప్పు రుసుం వసూలు చేస్తారు. కాగా, ఈ రైల్వే స్టేషన్‌లో ఇటీవల ఫిష్ స్పా, హ్యాండ్ లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్, మొబైల్ యాక్ససరీలకు సంబంధించిన ఔట్ లెట్స్‌ను ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments