Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు రద్దు

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (09:36 IST)
అసలే కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పిడుగులాంటి వార్తను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఆరు ప్రత్యేక రైళ్లను రెండు వారాలపాటు రద్దు చేసింది. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య గణనీయమైన స్థాయిలో తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 
 
రద్దు చేసిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్టణం - కాచిగూడ, (08561) రైలును రేపటి నుంచి జులై 14వ తేదీ వరకు, కాచిగూడ - విశాఖపట్టణం (08562) రైలును జులై 2 నుంచి 15వ తేదీ వరకు, విశాఖపట్టణం - కడప (07488) రైలును రేపటి నుంచి 14వ తేదీ వరకు, కడప - విశాఖపట్టణం (07487) రైలును 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, విశాఖపట్టణం - లింగంపల్లి (02831) రైలును రేపటి నుంచి 14వ తేదీ వరకు, లింగంపల్లి - విశాఖపట్టణం (02832) రైలును 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments