Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు రద్దు

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (09:36 IST)
అసలే కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పిడుగులాంటి వార్తను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఆరు ప్రత్యేక రైళ్లను రెండు వారాలపాటు రద్దు చేసింది. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య గణనీయమైన స్థాయిలో తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 
 
రద్దు చేసిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్టణం - కాచిగూడ, (08561) రైలును రేపటి నుంచి జులై 14వ తేదీ వరకు, కాచిగూడ - విశాఖపట్టణం (08562) రైలును జులై 2 నుంచి 15వ తేదీ వరకు, విశాఖపట్టణం - కడప (07488) రైలును రేపటి నుంచి 14వ తేదీ వరకు, కడప - విశాఖపట్టణం (07487) రైలును 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, విశాఖపట్టణం - లింగంపల్లి (02831) రైలును రేపటి నుంచి 14వ తేదీ వరకు, లింగంపల్లి - విశాఖపట్టణం (02832) రైలును 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments