Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి మందలించాడని కన్నతండ్రినే గొడ్డలితో చంపేశాడు..

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (22:04 IST)
తండ్రి మందలించాడని.. మద్యం మత్తులో కన్నతండ్రినే గొడ్డలితో అతి దారుణంగా నరికిచంపిన ఘటన కోసగిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోసిగి నాల్గవ వార్డులో అల్లమ్మ, వీరయ్య దంపతులు కూలిపనులు చేసుకుంటూ జీవనం గడిపేవారు. 
 
వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు సంతానం. ఇందులో పెద్దకుమారుడు నరసింహులు తండ్రి వీరయ్యకు మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఇద్దరు కూడా మద్యం తాగి గొడవపడేవారు.
 
నరసింహులు ప్రవర్తన సరిగా లేదని కొందరు గ్రామస్తులు తండ్రి వీరయ్యకు గత కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో కొడుకు నరసింహులును గత మూడు రోజుల క్రితం తండ్రి వీరయ్య మందలించారు. 
 
దీనిని జీర్ణించుకోలేని నరసింహులు అదను చూసి తండ్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మద్యం తాగి మద్యం మత్తులో గొడ్డలితో నరికి చంపి అదే గొడ్డలితో సోమవారం ఉదయం కోసిగి వీధుల్లో తిరుగుతూ హల్ చల్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments