Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి మందలించాడని కన్నతండ్రినే గొడ్డలితో చంపేశాడు..

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (22:04 IST)
తండ్రి మందలించాడని.. మద్యం మత్తులో కన్నతండ్రినే గొడ్డలితో అతి దారుణంగా నరికిచంపిన ఘటన కోసగిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోసిగి నాల్గవ వార్డులో అల్లమ్మ, వీరయ్య దంపతులు కూలిపనులు చేసుకుంటూ జీవనం గడిపేవారు. 
 
వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు సంతానం. ఇందులో పెద్దకుమారుడు నరసింహులు తండ్రి వీరయ్యకు మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఇద్దరు కూడా మద్యం తాగి గొడవపడేవారు.
 
నరసింహులు ప్రవర్తన సరిగా లేదని కొందరు గ్రామస్తులు తండ్రి వీరయ్యకు గత కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో కొడుకు నరసింహులును గత మూడు రోజుల క్రితం తండ్రి వీరయ్య మందలించారు. 
 
దీనిని జీర్ణించుకోలేని నరసింహులు అదను చూసి తండ్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మద్యం తాగి మద్యం మత్తులో గొడ్డలితో నరికి చంపి అదే గొడ్డలితో సోమవారం ఉదయం కోసిగి వీధుల్లో తిరుగుతూ హల్ చల్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments