Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి చేయి విదిలించడంతో.. పాపను కాటేసిన పాము.. గౌనులోకెళ్ళిన పామును తీసేలోపే..?

అమ్మపక్కన హాయిగా నిద్రించిన అభంశుభం తెలియని నాలుగేళ్ల పాప పాముకాటుతో నిద్రలోనే కన్నుమూసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలం, కురుకూటిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వంతల సీతయ్య, నీలమ్మ గిరి

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (16:00 IST)
అమ్మపక్కన హాయిగా నిద్రించిన అభంశుభం తెలియని నాలుగేళ్ల పాప పాముకాటుతో నిద్రలోనే కన్నుమూసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలం, కురుకూటిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వంతల సీతయ్య, నీలమ్మ గిరిజన దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు మగబిడ్డలు, నాలుగేళ్ల సునీత ఉన్నారు. రాత్రి భోజనాల తర్వాత సునీత తల్లి నీలమ్మ వద్ద పడుకుంది. 
 
నేలపైనే అందరూ నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో తల్లి నీలమ్మపై పాము పాకింది. నిద్రలో ఆమె చేయి విదల్చడంతో ఆ పాము పక్కనే ఉన్న చిన్నారి సునీతపై పడింది. పాము పాప గౌనులోకి వెళ్లింది. చిన్నారి చేయిపెట్టి తీయడానికి ప్రయత్నించడంతో పాము కాటు వేసింది. పాప ఏడుపు విని సునీత తల్లిదండ్రులు లైట్ వేసి చూశారు.
 
వారు కేకలు వేయడంతో పామును స్థానికులు పట్టుకున్నారు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తనపై పాకిన పాము తనను బలితీసుకుని వుంటే బాగుండునని తల్లి విలపించడం చూపరులను కలచివేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments