Webdunia - Bharat's app for daily news and videos

Install App

తక్కువ ధరకు బియ్యం ఇస్తానని ఇంటికి తీసుకెళ్లి వివాహితపై వ్యాపారి అత్యాచారం

హైదరాబాద్‌లో ఓ 45 యేళ్ళ వివాహితపై అత్యాచారం జరిగింది. తన దుకాణానికి వచ్చిన ఓ మహిళకు తక్కువ ధరకు బియ్యం ఇస్తానని ఇంటికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీ

Webdunia
మంగళవారం, 9 మే 2017 (10:53 IST)
హైదరాబాద్‌లో ఓ 45 యేళ్ళ వివాహితపై అత్యాచారం జరిగింది. తన దుకాణానికి వచ్చిన ఓ మహిళకు తక్కువ ధరకు బియ్యం ఇస్తానని ఇంటికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నగర్‌కు చెందిన అశోక్ అనే వ్యక్తి బియ్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. బియ్యం కొనేందుకు 45 ఏళ్ల వివాహిత అతని దుకాణానికి వచ్చింది. దుకాణంలో ఉండే బియ్యం ధర కాస్త ఎక్కువగా ఉందని, ఇంటికి వస్తే అక్కడ తక్కువ ధర బియ్యం ఉన్నాయని, అవి ఇస్తానంటూ నమ్మించాడు. దీంతో ఆయన వెంట ఆ మహిళ ఇంటికెళ్లింది. 
 
వివాహిత వ్యాపారి ఇంట్లో ఉన్న బియ్యం నాణ్యత చూస్తుండగా ఒక్క ఉదుటున వెనుకనుంచి పట్టుకొని తనపై అత్యాచారం చేశాడని బాధిత వివాహిత పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ అత్యాచారానికి మరో వ్యక్తి సహకరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత మహిళను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి పంపించి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments