Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయలచెరువుకు చిన్న లీకేజీ, అపాయం లేదు కానీ..?

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (19:28 IST)
గత రెండు రోజుల నుంచి చిత్తూరు జిల్లాలోని రాయలచెరువుకు పడిన గండి ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. ఏ క్షణమైనా చెరువు కట్ట తెగిపోతుందని గ్రామస్తులు ఊర్లకు ఊర్లు ఖాళీ చేశారు. 0.9 టిఎంసి సామర్థ్యం ఉన్న రాయలచెరువులో అధికంగా నీటి సామర్థ్యం ఉండడంతో కట్ట తెగే అవకాశముందన్న ఆందోళన నెలకొంది.

 
దీంతో రాయలచెరువు చుట్టుపక్కల ఉన్న సుమారు 16 గ్రామ ప్రజలను హుటాహుటిన అధికారులు తరలించారు. మూడు వేల మందికి పైగా గ్రామస్తులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే టీటిడి సహకారంతో తిరుచానూరులోని పద్మావతి నిలయం కూడా పునరావాస కేంద్రంగా మార్చుకున్నారు.

 
ప్రస్తుతం రాయల చెరువు వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఇసుక వేసిన తర్వాత గండి ఏమాత్రం పూడకపోవడంతో ఈరోజు మధ్యాహ్నం సిమెంటు ఇసుక కలిపిన మిశ్రమాన్ని చెరువుకి పడిన గండి వద్ద కూలీలు వేస్తున్నారు.

 
సిమెంటు ఇసుకతో ఉన్న మిశ్రమం గండి దగ్గర వేయడం వల్ల గట్టిగా మారిపోయి నీరు బయటకు వెళ్లే ఉధృతి తగ్గుతుందన్న నమ్మకంతో అధికారులు ఉన్నారు. మూడు వందల మందికి పైగా కూలీలు శ్రమించి ప్రస్తుతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

 
ప్రస్తుతానికైతే రాయల చెరువు వద్ద ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తోంది. వర్షం పడుతున్న పరిస్థితుల్లో వరద ఉధృతి పెరిగి చెరువు కట్ట ఏ క్షణమైనా తెగే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments