Tirupati Stampede తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లకై తొక్కిసలాట: ఆరుగురు భక్తులు మృతి

ఐవీఆర్
బుధవారం, 8 జనవరి 2025 (22:19 IST)
Tirupati Stampede తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటుచేసుకున్నది. ఈ నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి (vaikuntha ekadashi 2025) సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో భక్తులు పోటెత్తారు. ఈ టిక్కెట్ల జారీ సమయంలో ఒక్కసారిగా భక్తులు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 6 మంది భక్తులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.
 
టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు చేరడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు తమిళనాడులోని సేలంకి చెందినవారుగా గుర్తించారు.

క్యూలో కనీసం 5 వేల మంది భక్తులు టిక్కెట్ల కోసం వున్నారు. అందర్నీ క్యూ లైన్లలో పంపమని చెప్పినా ఒక్కసారిగా గేటు తీసారు. దాంతో తొక్కిసలాట జరిగి 10 మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఇది రామానాయుడు కాలేజి దగ్గర జరిగిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments