Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tirupati Stampede తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లకై తొక్కిసలాట: ఆరుగురు భక్తులు మృతి

ఐవీఆర్
బుధవారం, 8 జనవరి 2025 (22:19 IST)
Tirupati Stampede తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటుచేసుకున్నది. ఈ నెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి (vaikuntha ekadashi 2025) సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో భక్తులు పోటెత్తారు. ఈ టిక్కెట్ల జారీ సమయంలో ఒక్కసారిగా భక్తులు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 6 మంది భక్తులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.
 
టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు చేరడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు తమిళనాడులోని సేలంకి చెందినవారుగా గుర్తించారు.

క్యూలో కనీసం 5 వేల మంది భక్తులు టిక్కెట్ల కోసం వున్నారు. అందర్నీ క్యూ లైన్లలో పంపమని చెప్పినా ఒక్కసారిగా గేటు తీసారు. దాంతో తొక్కిసలాట జరిగి 10 మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఇది రామానాయుడు కాలేజి దగ్గర జరిగిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments