Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిత్రాంగ్ తుఫాను.. ఏపీ, తెలంగాణకు ముప్పు పొంచి వుందా?

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (13:07 IST)
సిత్రాంగ్ తుఫాను ప్రభావం కారణంగా ఒడిశాలో భారీ భారీ ర్షాలు కురిసే అవకాశం ఉందని, పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌ వైపు ఈ వర్షాలు దూసుకువెళ్లే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. దీంతో పశ్చిమబెంగాల్‌, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. 
 
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఉత్తర అండమాన్‌ సముద్రం, సంబంధిత ప్రాంతాలపై పరుచుకున్న అల్పపీడనం, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.  
 
అయితే సిత్రాంగ్ తుపాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పులేదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. 
 
ఉత్తర, దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడం ఉత్తర, పశ్చిమ దిశలలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారిందని వెల్లడించింది. వాయుగుండం తుపానుగా మారడంతో మరో మూడు రోజుల వరకు ఏపీలో పలు జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. త్వరలోనే ఈశాన్య రుతుపవనాలు ఏపీలో నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తాయని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments