Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీషకు నా భర్తకు లింకులేదన్న రచన: శిరీష సూసైడ్ వెనక బలమైన కారణం ఉంటుందన్న తేజస్విని

ఆర్జే స్టూడియోలో మరణించిన శిరీష ఆత్మహత్య కేసులో ఎవరికి తోచింది వారు చెప్తున్నారు. శిరీషది ఆత్మహత్య కాదని హత్యేనని ఆమె కుటుంబీకులు అంటుంటే.. శిరీషకు ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఎలాంటి సంబంధం లేదని.. ఉన్నతాధి

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (18:56 IST)
ఆర్జే స్టూడియోలో మరణించిన శిరీష ఆత్మహత్య కేసులో ఎవరికి తోచింది వారు చెప్తున్నారు. శిరీషది ఆత్మహత్య కాదని హత్యేనని ఆమె కుటుంబీకులు అంటుంటే.. శిరీషకు ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఎలాంటి సంబంధం లేదని.. ఉన్నతాధికారుల వేధింపులే తన భర్త మృతికి కారణమని ఎస్సై సతీమణి రచన అంటున్నారు. శిరీష మృతి పట్ల అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. 
 
ఈ నేపథ్యంలో రాజీవ్, శ్రవణ్‌లను విడివిడిగా పోలీసులు విచారించారు. మంగళవారం ఉదయం ఈ కేసులో కీలక సాక్షి తేజస్విని వెలుగులోకి రాగా, ఆపై కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి భార్య రచన తొలిసారిగా తన వాదనను వినిపించారు. తన భర్త మృతికి శిరీష వివాదం కారణం కానేకాదన్నారు. 
 
ఇలాంటి కేసులను ఆయన ఎన్నో పరిష్కరించాడని రచన చెప్పారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఏసీపీ గిరిధర్ తన భర్తను వేధించాడని, ఆయన్ను విచారిస్తే మరింత సమాచారం తెలుస్తుందన్నారు.
 
మరోవైపు రాజీవ్ విషయంలో తను, శిరీష గొడవ పడ్డామని తేజస్విని చెప్పింది. తామిద్దరం రోడ్డుపై తన్నుకుంటుంటే విడదీయలేక రాజీవ్ వందకు కాల్ చేసి పోలీసులను పిలిపించాడని.. అప్పుడే కేసును పరిష్కరించి వుంటే ఇప్పుడింత దారుణం జరిగి వుండేది కాదని తేజస్విని వెల్లడించింది. 
 
రాజీవ్ లేని సమయంలో తాను స్టూడియోకు వెళ్లి, అతన్ని వదిలివేయాలని శిరీషతో వాగ్వాదానికి దిగేదాన్ని. అప్పుడు తనను ఇద్దరు వ్యక్తులతో బెదిరించిందని, ఆపై కాసేపటికి రాజీవ్ వచ్చాడని రెండు నెలల క్రితం జరిగిన ఘటనను ఆమె పోలీసులకు వివరించింది. అప్పట్లోనే పోలీసులు కలుగజేసుకుని వుంటే శిరీష మరణించేది కాదని తేజస్విని వెల్లడించింది. 
 
ఫేస్ బుక్‌లో శిరీష ఫోటోలను రాజీవ్ ట్యాగ్ చేసినప్పుడు తనకు తొలిసారిగా అనుమానం వచ్చిందని తేజస్విని తెలిపింది. రాజీవ్ కోసమే హైదరాబాద్ వచ్చానని.. రాజీవ్‌ను గాఢంగా ప్రేమించబట్టే శిరీషతో గొడవకు దిగానని.. దాని కారణంగా శిరీష ఆత్మహత్య చేసుకుంటుందని తాను భావించలేదని.. ఆమె మృతి వెనుక మరో బలమైన కారణం ఉండే ఉంటుందని తేజస్విని పోలీసులతో చెప్పినట్టు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments