Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ న్యూస్: టెట్ పరీక్షలు బాగా రాయలేదన్న మనస్తాపంతో ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఓ విషాదకర సంఘటన జరిగింది. టెట్ పరీక్షలు బాగా రాయలేదన్న మనస్తాపంతో ఓ యువతి వేగంగా వస్తున్న రైలు కిందపడి ప్రాణాలు తీసుకుంది.

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (13:25 IST)
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఓ విషాదకర సంఘటన జరిగింది. టెట్ పరీక్షలు బాగా రాయలేదన్న మనస్తాపంతో ఓ యువతి వేగంగా వస్తున్న రైలు కిందపడి ప్రాణాలు తీసుకుంది. ఈనెల 18వ తేదీన ఈ విషాదకర సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
నిజామాబాద్ జిల్లాకు చెందిన సుస్మిత అనే 25 యేళ్ళ యువతి హైదరాబాద్‌లో జరిగిన టెట్ పరీక్షకు హాజరైంది. ఈ పరీక్షను ఆమె సరిగ్గా రాయలేదు. ఇది ఆమెను బాగా కుంగదీసింది. పైగా ఈ పరీక్షలో పాస్ కాలేనన్న అపనమ్మకం ఆమెలో బలంగా నాటుకుపోయింది. 
 
ఆ తర్వాత హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు తిరుగుపయనమైంది. కామారెడ్డి స్టేషన్‌కు ముందు.. ఆ యువతి ప్రయాణిస్తున్న రైలుకు సిగ్నల్ లేకపోవడంతో ఆగింది. అదేసమయంలో మరో ట్రాక్‌పై ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ అమితవేగంతో వస్తోంది. దీన్ని గమనించిన ఆ యువతి.. ఉన్నట్టుండి రైలు దిగి.. వేగంగా వస్తున్న ఇంటర్ సిటీ రైలుకింద పడిపోయింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది. 
 
లెవల్ క్రాసింగ్ వద్ద సరదాగా సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన ఓ యువకుడు హఠాత్తుగా ఆమె ట్రైన్ కిందపడటం చూసి షాకై, వీడియో తీశాడు. ఆ తర్వాత యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు ఈ వీడియో పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments