Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగలపూడి అనితకు షోకాజ్ నోటీసులు.. టీడీపీ చిర్రుబుర్రు

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (19:05 IST)
ఏపీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వంగలపూడి అనితకు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. 
 
మహిళా దినోత్సవం సందర్భంగా లోకేష్ పాదయాత్రలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనిత చేసిన వ్యాఖ్యలకు గాను ఈ నోటీసు ఇచ్చారని ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ప్రెస్ మీట్‌లో 2024లో జగన్‌‌ను మళ్ళీ సీఎం చేయడానికి మహిళలందరూ సిద్ధం కావాలనే ఉద్దేశంతో అనిత మాట్లాడటంతో తెలుగు దేశం పార్టీకి చెందిన మహిళ కార్యకర్తలు, మహిళ నాయకుల్లో ఒకింత షాక్‌కు గురైయ్యారని తెలిసింది. దీంతో ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇక అనిత చేసిన సదరు వ్యాఖ్యలపై 48 గంటల్లోపు వివరణ ఇవ్వాలనే నోటీసు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ నోటీసు వైకాపా కుట్ర అంటూ టీడీపీ ఫైర్ అయ్యింది. 
 
ఇదంతా వైకాపా కుట్ర అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడింది. వైసీపీ మీడియా సృష్టించిన ఫోర్జరీ లేఖ ఇదంటూ... ఏం జగన్ రెడ్డి! ఇదేనా నీ రాజకీయం? అంటూ టీడీపీ ఘాటుగా స్పందించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments