Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్‌లో టాంజానియా తరహా ఘటన: మహిళను వివస్త్ర చేసి ఊరేగించారు!

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (12:17 IST)
కర్ణాటక రాజధాని బెంగళూరులో టాంజానియా యువతిపై దాడి చేసి వివస్త్రను చేసిన ఘటన మరవక ముందే.. వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని వర్థన్నపేట మండలం డీసీ తండాలో ఓ మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన ఘటన తలదించుకునేలా చేసింది. ఈ ప్రాంతానికి చెందిన రవి అనే వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారు. వారిలో రెండో భార్య అనిత పట్ల బంధువులు దారుణంగా ప్రవర్తించారు. 
 
రవి మొదటి భార్య బంధువులు రవి రెండో భార్యను చిత్ర హింసలకు గురిచేసి అమానుషంగా ప్రవర్తించారు. ఆమె ఒంటిపై కర్రలు, ఇనుప చువ్వలతో కాల్చారు. అంతటితో ఆగకుండా వివస్త్రను చేసి తండాలో ఊరేగించారు. ఈ సంఘటన తెలిసిన కొంతమంది స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చి బాధితురాలు అనితను ఆసుపత్రికి తరలించారు. 
 
ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు కొనసాగించారు. మొదటి భార్య ఉండగానే రెండో పెళ్ళి చేసుకోవడం, అందుకు ఆ మహిళ అంగీకరించడంతోనే తొలి భార్య బంధువులు ఆమెపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments