Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్నానదిలో ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతు

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (11:12 IST)
పెన్నా నదిలో సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన కడప జిల్లా సిద్ధవటం అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతిలోకి కోరగుంటకు చెందిన కొందరు యువకులు కడప జిల్లాకు విహార యాత్రకు వెళ్లారు. 
 
ఆ తర్వాత సిద్ధవటంలో పెన్నానదిలో ఈతకు వెళ్లారు. ఈ ఏడుగురు గల్లంతయ్యారు. ఈత కొడదామని నదిలో దిగి, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయారని వివరించారు.
 
ఈ విషయాన్ని కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లు పిలిపించి నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. 
 
గల్లంతైన వారు తిరుపతిలోకి కోరగుంటకు చెందిన వారని గుర్తించారు. ఇప్పటివరకు ఆరుగురు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
 
పెన్నానదిలో గల్లైంతనవారిని తిరుపతి సమీపంలోని కోరగుంట నుంచి సోమశేఖర్‌, యశ్‌, జగదీశ్‌, సతీష్‌, చెన్ను, రాజేష్‌, తరుణ్‌ అనే యవకులుగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. రెండేళ్ల సహజీవనం తర్వాత?

‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బాదం పిసిన్‌ను మహిళలు ఎందుకు తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments