Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదా కోసం బీచ్‌కు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థులు.. ఏడుగురు గల్లంతు

Beach
Webdunia
శనివారం, 30 జులై 2022 (13:52 IST)
అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్‌లో సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఒక విద్యార్థి మరణించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. 
 
అమావాస్య కావడం, చీకటి పడటం రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డంకిగా మారాయి. ఇప్పటికీ గల్లంతైన ఐదుగురు విద్యార్థుల ఆచూకీ లభ్యం కాలేదన్నారు పోలీసులు. అటు రెస్క్యూ కోసం నేవీ, కోస్ట్ గార్డ్స్ సాయం తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి రెస్క్యూ ఆగిపోయింది. శనివారం ఉదయం నుంచి మళ్లీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. 
 
అలల ఉధృతి కారణంగా నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో నర్సీపట్నానికి చెందిన పవన్ మృతి చెందగా.. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.
 
గోపాలపట్నానికి చెందిన జగదీశ్, నర్సీపట్నానికి చెందిన జశ్వంత్, గుంటూరుకి చెందిన సతీశ్, గణేశ్, యలమంచిలికి చెందిన చందు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం తీరం వద్ద పోలీసులు, మెరైన్ పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments