Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం: వేగంగా వెళ్తున్న లారీని ఢీకొట్టి స్కూలు పిల్లల ప్రాణాల మీదకి తెచ్చాడు

Webdunia
బుధవారం, 22 నవంబరు 2023 (21:31 IST)
కొందరు ఆటోడ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల వాటిలో ప్రయాణిస్తున్నవారి ప్రాణాల మీదకు వస్తోంది. బుధవారం నాడు విశాఖ నగరంలో సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మెయిన్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీని స్కూలు పిల్లలను ఎక్కించుకుని వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది.
 
రైల్వే స్టేషను నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఆటో... వేగంగా వస్తున్న లారీని ఢీకొన్నది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో స్కూలు వెళ్తున్న ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ చిన్నారులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. లారీ డ్రైవర్, క్లీనర్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments