Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌడీ షీటర్ బోరుగడ్డకు చికెన్ బిర్యానీ తినిపించిన పోలీసులపై వేటు...(Video)

ఠాగూర్
గురువారం, 7 నవంబరు 2024 (09:46 IST)
వైకాపా నేత, రౌడీ షీటర్, పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు ఏపీ పోలీసులు రాచమర్యాదలు కల్పించారు. ఆయన అడిగిందే తడవుగా ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ తినిపించారు. అంతటితో ఆగని పోలీసులు.. పోలీసు వాహనంలో కాకుండా లగ్జరీ కారులో తీసుకెళ్లారు. ఇలా నిందితుడుకి సపర్యలు చేసిన ఏడుగురు పోలీసులకు ఏపీ ప్రభుత్వం తగిన ట్రీట్మెంట్ ఇచ్చింది. ఏడుగురు ఖాకీలను సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా  ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. 
 
మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించే సమయంలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను గుంటూరు క్రాస్ రోడ్డులో ఉన్న ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. అతనితో సరదాగా మాట్లాడుతూ చికెన్ బిర్యాని తినిపించారు. రెస్టారెంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో పోలీసుల వ్యవహారం అంత నమోదు కావడంతో ఆ వీడియో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇంత సహసానికి పాల్పడిన ఏడుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్!

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments