Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడున్నర సంవత్సరాలైనా ఏపీ రాజధాని ఎక్కడో తెలీదు, మళ్లీ గందరగోళం: పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (21:46 IST)
ఏపీ 3 రాజధానులు బిల్లును ఉపసంహరించుకుని మరో కొత్త రూపంతో వస్తానంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ విడిపోయి ఏడున్నర సంవత్సరాలైనా అసలు రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితిలోకి పాలకులు నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 
ఆనాడు అసెంబ్లీలో రాష్ట్ర రాజధానిపై చర్చ జరిగినప్పుడు జగన్ మోహన్ రెడ్డి అంగీకరించి ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను ఇచ్చిన రైతుల త్యాగాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందనీ, అలాంటి త్యాగం ఎక్కడా చూడలేదన్నారు. ప్రజలకు పూర్తిగా న్యాయం జరగాలన్నా రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలన్నా రాష్ట్రానికి ఒకే రాజధాని వుండాలన్నారు. ఆ రాజధానిని కేంద్రంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయాలని జనసేన కోరుకుంటోందని చెప్పారు.

 
అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటానికి జనసేన సంపూర్ణ మద్దతు వుంటుందన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులను మార్చడం ఎక్కడైనా చూశారా అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments