Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడున్నర సంవత్సరాలైనా ఏపీ రాజధాని ఎక్కడో తెలీదు, మళ్లీ గందరగోళం: పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (21:46 IST)
ఏపీ 3 రాజధానులు బిల్లును ఉపసంహరించుకుని మరో కొత్త రూపంతో వస్తానంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ విడిపోయి ఏడున్నర సంవత్సరాలైనా అసలు రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితిలోకి పాలకులు నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

 
ఆనాడు అసెంబ్లీలో రాష్ట్ర రాజధానిపై చర్చ జరిగినప్పుడు జగన్ మోహన్ రెడ్డి అంగీకరించి ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను ఇచ్చిన రైతుల త్యాగాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందనీ, అలాంటి త్యాగం ఎక్కడా చూడలేదన్నారు. ప్రజలకు పూర్తిగా న్యాయం జరగాలన్నా రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలన్నా రాష్ట్రానికి ఒకే రాజధాని వుండాలన్నారు. ఆ రాజధానిని కేంద్రంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయాలని జనసేన కోరుకుంటోందని చెప్పారు.

 
అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటానికి జనసేన సంపూర్ణ మద్దతు వుంటుందన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులను మార్చడం ఎక్కడైనా చూశారా అంటూ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments