Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.5 వేల కోసం ఫ్రెండ్‌ను చంపేశాడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (16:51 IST)
సికింద్రాబాద్ నగరంలో కేవలం ఐదు వేల రూపాయల కోసం ఒక యువకుడు తన ఫ్రెండ్‌ను అత్యంత పాశవికంగా చంపేశాడు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బోయిన్‌పల్లి చిన్నతోకట్ట అనే ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ (27), వికాస్ తివారి (24) అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీరిలో వికాస్ వద్ద అజయ్ కుమార్ రూ.5 వేలు అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు తిరిగి ఇవ్వలేదు. అయితే, తన అప్పు చెల్లించాలని ఈనెల 14వ తేదీన అజయ్‌ ఇంటికి వికాస్ వెళ్ళాడు.
 
ఆ తర్వాత వారిద్దరూ కలిసి అర్థరాత్రి వరకు మద్యం సేవించారు. అపుడు కూడా అజయ్‌ను డబ్బులు ఇవ్వాలని వికాస్ కోరాడు. దీంతో ఆగ్రహించిన అజయ్... క్షణికావేశంలో వికాస్ తలపై బండరాయితో మోదాడు. ఆ తర్వాత మృతుని సెల్‌ఫోన్ తీసుకుని ఢిల్లీకి పారిపోయాడు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కానీ పోలీసులకు ఎలాంటి ఆధారం చిక్కలేదు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన అజయ్... అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments