Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినుకొండకు మాజీ సీఎం జగన్... 144 సెక్షన్ అమలు!!

వరుణ్
శుక్రవారం, 19 జులై 2024 (12:11 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పల్నాడు జిల్లా వినుకొండకు వస్తున్నాు. నడి రోడ్డుపై దారుణ హత్యకు గురైన వైకాపా కార్యకర్త రషీద్ మృతదేహానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి కీలక ప్రకటన జారీ చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైకాపా నేతలు ఎలాంటి జన సమీకరణలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా, వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఐజీ తెలిపారు. 
 
అందువల్ల పట్టణంలో ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్పారు. మృతుడు రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించవచ్చని, కానీ జనసమీకరణతో ప్రదర్శనలు చేయరాదని స్పష్టం చేశారు. మరోవైవు, వినుకొండలో ప్రస్తుతం ప్రశాంతమైన పరిస్థితి ఉందని, అనవసరంగా రోడ్లపైకి వచ్చిన శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మరోవైపు, జగన్ పర్యటన నేపథ్యంలో వినుకొండలో భారీ పోలీస్ భద్రతను కల్పించారు. ఇందుకోసం 400 మంది పోలీసులను మొహరించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments